న్యూఢిల్లీ: తొలుత పెట్రో కెమికల్స్.. అటుపై జియో.. రిటైల్.. ఈ-కామర్స్ రంగాలకు విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా ఔషధ రంగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మానవాళికి సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారి చికిత్సకు అవసరమైన ఔషధాలను తయారు చేసేందుకు సంసిద్ధం అవుతున్నది.
ఈ ప్రక్రియలో భాగంగా ‘నిక్లోసామైడ్’ అనే ఔషధాన్ని కొవిడ్-19 చికిత్సకు వినియోగించాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చింది. విశ్వమారి చికిత్సకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తించిన అత్యవసర మెడిసిన్లలో ఇదొకటి.
గత 50 ఏండ్లుగా వైద్యులు నిక్లోసామైడ్ ఔషధాన్ని నులిపురుగుల నివారణ (టేప్వార్మ్ ఇన్ఫెక్షన్)కు వినియోగిస్తున్నారు. 2003-04లో ఆఫ్రికా దేశాల్లో, మరికొన్ని ఇతర దేశాల్లో వెలుగుచూసిన సార్స్ వ్యాధికి చికిత్సలో వైద్యులు ఈ మందు సిఫారసు చేశారు.
కోవిడ్-19 బాధితుల చికిత్సలో ‘నిక్లోసామైడ్’ ఔషధ వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశాం’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదికలో బయటపెట్టింది.
అయితే, ఈ మెడిసిన్ స్వయంగా తయారు చేయాలనుకుంటుందా, తన దవాఖానాల్లో వాడాలనుకుంటోందా.. అన్న సంగతి రిలయన్స్ బహిర్గతం చేయలేదు.
ఇప్పటికే ఈ మందును మనదేశంలో కొవిడ్-19 బాధితులపై పరీక్షిస్తున్నారు. దీనిపై రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.
ఇదే కాక నెగ్జర్ పాలీమర్ అనే మెడిసిన్పైనా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)తో రిలయన్స్ పరిశోధన & డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) బృందం కలిసి పరీక్షలు నిర్వహిస్తున్నది. పలు వైరస్లు, బ్యాక్టీరియా వల్ల మనుషుల్లో ఏర్పడే లిపిడ్ పొరను నాశనానికి ఇది ఉపకరిస్తుందని అంచనా.
ఇక కొవిడ్-19 నిర్థారణకు తక్కువ ధరల్లో లభించే డయాగ్నస్టిక్ కిట్లనూ రిలయన్స్ అభివృద్ధి చేస్తున్నది. ఇప్పటికే ఆర్-గ్రీన్, ఆ-గ్రీన్ ప్రొ కిట్లను ఆవిష్కరించింది. వీటికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) గుర్తింపు లభించింది.
ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు ఉన్న గదుల కొరతను పరిగణనలోకి తీసుకుని ఇటలీలో మాదిరిగా 3డి-ప్రింటెడ్ ఛార్లొట్టే వాల్వ్, స్నోర్కెల్లింగ్ మాస్క్తో కూడిన సిపాప్ యంత్రం ఆవిష్కరణ పనిలో నిమగ్నమైంది. ఆక్సిజన్ జనరేటర్ల డిజైన్ ప్రాజెక్టుపైనా కేంద్రీకరించింది.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం