హైదరాబాద్, ఆగస్టు 11: వినియోగదారుల పరిశుభ్రత పరికరాల విభాగంలోకి తాజాగా రిలయన్స్ రిటైల్ ప్రవేశించింది. సంస్థ ప్యూరిక్ ఇన్స్టాసేఫ్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనాతో శుభ్రతకు పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో సంస్థ ఈ నూతన ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అనారోగ్యం కల్గించే సూక్ష్మక్రిముల, వైరస్ల నుంచి ఎలాంటి దుష్ప్రభావాలు కల్గించకుండా పనిచేయనున్నాయని తెలిపింది. ఈ ఉత్పత్తులు రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్ పాయింట్, బిగ్బజార్ల్లో లభించనున్నాయి.