Reliance-Just Dial | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ చేతికి 25 ఏండ్ల నాటి సెర్చ్ అండ్ డిస్కవరీ సంస్థ జస్ట్ డయల్ చిక్కింది. జస్ట్ డయల్లో తమ అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 40 శాతం వాటాను టేకోవర్ చేసినట్లు రిలయన్స్ రిటైల్ గురువారం ప్రకటించింది.
సెబీ నియంత్రణ నిబంధనల ప్రకారం బుధవారం నుంచి జస్ట్ డయల్ తమ నియంత్రణలో ఉంటుందని పేర్కొంది. రూ.3,497 కోట్లకు జస్ట్డయల్లో మెజారిటీ వాటాను కైవశం చేసుకున్నట్లు గత జూలైలో రిలయన్స్ వివరించింది.
గత జూలై 20న జస్ట్ డయల్లోని రూ.10 ముఖ విలువ గల 1.31 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశామని తెలిపింది. జస్ట్ డయల్ సీఈవో కం ఫౌండర్ వీఎస్ఎస్ మణి నుంచి రూ.1020 చొప్పున ఈక్విటీ షేర్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
ఈక్విటీ షేర్ క్యాపిటల్పై పోస్ట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా 15.63 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ వివరించింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.10 ముఖ విలువ గల 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను. రూ.1,022.25లకు కొనుగోలు చేసింది రిలయన్స్. ఇలా 25.35 శాతం జస్ట్ డయల్ వాటాలను రిలయన్స్ రిటైల్ హస్తగతం చేసుకున్నది.