నాగచైతన్య నటించిన లవ్స్టోరీ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇపుడు చైతూ మరో సినిమాకు కూడా చిక్కులు వచ్చిపడ్డాయి. చైతూ మరో కొత్త ప్రాజెక్టు థాంక్యూ సినిమా చేస్తున్నాడు. కరోనా కేసుల కారణంగా చైతూ కొత్త సినిమా షూటింగ్ నిలిచిపోయిందని టాలీవుడ్ వర్గాల టాక్. ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ కోసం చైతూ అండ్ టీం 15 రోజులు ఇటలీ షెడ్యూల్ కు వెళ్లాల్సింది. కరోనా ప్రభావం నేపథ్యంలో ప్లాన్ ను రద్దు చేసుకుందట టీం.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మాళవిక నాయర్, అవికాగోర్ కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిసతున్నాడు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…