న్యూఢిల్లీ: కికెట్ ఫ్యాన్స్కు పండుగ వాతావరణాన్ని అందించేది ఐపీఎల్ టోర్నీ.. త్వరలో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ కోసం దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు స్పెషలాఫర్లు ప్రకటించింది. జియో పోస్ట్పెయిడ్ ప్లస్ ప్లాన్ అన్నీ ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించే సౌకర్యం కల్పిస్తున్నది. ఇక ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు డిస్నీప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో కలిపి ఈ ప్లాన్ అందుబాటులోకి రానున్నది.
జియో 401 ప్రీ-పెయిడ్ ప్లాన్ కింద ప్రతి రోజూ త్రీ జీబీ హైస్పీడ్ డేటాను పొందొచ్చు. ఇంకా డిస్నీప్లస్ హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్తో పాటు, 6జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కాల పరిమితి 28 రోజులు ఉంటుంది.
598 ప్రీపెయిడ్ ప్లాన్ కింద రూ.598తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు రోజూ 2జీబీ డేటా పొందవచ్చు. ఉచితంగా అపరిమిత కాల్స్ చేయడంతోపాటు ఎస్ఎంఎస్లు పంపొచ్చు. అయితే ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఏడాది డిస్నీ + హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ గడువు 56 రోజులు మాత్రమే.
ఇక జియో 777 ప్రీ పెయిడ్ ప్లాన్ కింద రోజూ 1.5జీబీ డేటాతో పాటు, అపరిమితి కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందవచ్చు. ఇంకా ఉచితంగా ఏడాది పాటు డిస్నీ + హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. దీని గడువు 84 రోజులు ఉంటుంది.
వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్గా భావించే జియో 2599 ప్రీపెయిడ్ ప్లాన్లో ఉచిత అపరిమిత కాల్స్తో పాటు రోజు 2జీబీ డేటా పొందవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం.
జియో ఫోన్ వినియోగదారులు జియో క్రికెట్యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా స్కోర్ అప్డేట్స్తో పాటు క్విజ్ కాంటెస్ట్లో పాల్గొని బహుమతులూ గెలుచుకోవచ్చు.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్కార్ట్ డీల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్