ముంబై: రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.3,651 కోట్ల నికర లాభం గడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 44.9 శాతం పురోగతిని నమోదు చేసింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ శుక్రవారం సంస్థ తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించారు.
గతేడాది (2020-21)లో జియో రూ.2,519 కోట్ల నికర లాభం పొందింది. జియో ఈబీఐటీడీఏ రూ.8,892 కోట్లు కాగా, ఆపరేషన్ల ద్వారా రూ.18,952 కోట్ల ఆదాయం సంపాదించింది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు రికార్డు స్థాయిలో జియో 14.3 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను జత చేసుకున్నది. జూన్ 30 నాటికి రిలయన్స్ జియో ఖాతాదారులు 440.6 మిలియన్లుగా నిలిచారు.
తొలి త్రైమాసికంలో రిలయన్స్ జియో టోటల్ డేటా ట్రాఫిక్ 20.3 బిలియన్ల జీబీగా నిలిచింది. వాయిస్ ట్రాఫిక్ గతేడాదితో పోలిస్తే 19.5 శాతం పెరిగి 1.06 లక్షల కోట్ల నిమిషాలకు పెరిగింది.
జియో వినియోగదారుడి సగటు ఆదాయం (అర్పు) రూ.138.4 ఎక్కువైంది. సాధారణంగా సబ్స్క్రైబర్లు పెరిగినా.. కోవిడ్ ప్రభావం పడింది.
రెండో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
Tokyo Olympics: ఆ అథ్లెట్లు నాటిన చెట్ల నుంచే ఆ ఐదు రింగులు
ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం.. టీమిండియా రికార్డు
Tokyo Olympics: ఓపెనింగ్ సెర్మనీ పరేడ్లో పాల్గొన్న ఇండియన్ అథ్లెట్లు
యాక్షన్ గేమ్స్ పక్కనపెట్టండి.. గూగుల్ డూడుల్తో ఒలింపిక్ గేమ్స్ ఆడతారా?
Tokyo Olympics : ఈ ఏడుగురు వనితల్లో స్వర్ణం తెచ్చేదెవరో
Tokyo Olympics: టోక్యోలో రోడ్లపై బతుకీడుస్తున్న వాళ్లను వెళ్లగొట్టిన నిర్వాహకులు
అమెజాన్-ఫ్లిప్కార్ట్కు షాక్.. సీసీఐ విచారణను అడ్డుకోలేం.. కర్ణాటక హైకోర్టు
యడియూరప్పను తొలగించేందుకు బీజేపీ హైకమాండ్ కుట్ర!
దాంపత్య రహస్యాలు లీక్ చేసేది వాళ్ళే….
నిర్మల్లో నడి రోడ్డుపై చేపల కోసం జనం పరుగులు.. వీడియో