జియో శక్తిమంతమైన బ్రాండ్

- ప్రపంచంలో ఐదో స్థానం: బ్రాండ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ, జనవరి 28: రిలయన్స్ జియో.. ప్రపంచంలోని అత్యంత బలమైన బ్రాండ్లలో ఐదో స్థానంలో నిలిచింది. తాజా బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 ర్యాంకింగ్స్లో నాలుగేండ్లలోనే ముకేశ్ అంబానీ టెలికం సంస్థ టాప్-5లోకి చేరడం గమనార్హం. 2016లో మొదలైన జియో.. ప్రస్తుతం భారత్లో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్గా అవతరించిందని, దాదాపు 40 కోట్ల కస్టమర్లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్గా ఉందని ఈ సందర్భంగా బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటించింది. కాగా, శక్తిమంతమైన బ్రాండ్లలో తొలి స్థానంలో చైనా మొబైల్ యాప్ వుయ్చాట్ ఉన్నది. రెండో స్థానంలో ఫెరారీ, మూడో స్థానంలో రష్యా బ్యాంక్ ఎస్బర్, నాలుగో స్థానంలో కోకాకోలా ఉన్నాయి. ఇక ఈ ఏడాదికిగాను టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ అని తేలింది. రెండు, మూడు స్థానాల్లో అమెజాన్, గూగుల్ ఉన్నాయి. అత్యంత విలువైన టెలికం బ్రాండ్గా వెరిజాన్ నిలిచింది. దీని విలువ 68.9 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
తాజావార్తలు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?
- పొరపాటున గన్తో వ్యక్తి కాల్పులు.. మరణించిన మేనల్లుడు
- కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయ్యిందా..?