హైదరాబాద్ : తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని అభిమానులు షర్మిలను కోరారు.