గుమ్మడిదల, జూలై 8 : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసుకొని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో పీఆర్ రోడ్డు నుంచి లింగమయ్య గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.45 లక్షల తన సొంత నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టడంతో సర్పంచ్ వాసవీదామోదర్రెడ్డి, ఉపసర్పంచ్ ప్రవళికాగోవర్ధన్రెడ్డి, వార్డు సభ్యులు కలిసి ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాం లో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, నర్సరీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు నిర్మాణం పూర్తయిందన్నారు. పేదలకు వైకుంఠధామాల చింత తీరిందని గుర్తు చేశారు.
గతంలో రాంరెడ్డిబావి గ్రామానికి సీసీ రోడ్డు వేయిస్తానని ఇచ్చిన హామీ నేటితో నెరవేరిందన్నారు. అనంతరం గుమ్మడిదల పీఏసీఎస్ డైరెక్టర్ ధర్మారెడ్డి (రాంరెడ్డిబావి) ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఆయన ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్రెడ్డి, వైస్ఎంపీపీ మంజుల వెంకటేశ్గౌడ్, గుమ్మడిదల, జిన్నారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరేందర్రెడ్డి, రాజేశ్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోవర్ధన్రెడ్డి, వెంకటేశంగౌడ్, పద్మారెడ్డి, కరుణాకర్రెడ్డి, కుమ్మరి వెంకటేశ్, సర్పంచ్లు ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, మమతావేణు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చుకుందాం..
గుమ్మడిదల, జూలై 8 : రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ వాసవీదామోదర్రెడ్డితో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెప్రగతి, హరితహారంతో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, ఉపసర్పంచ్ ప్రవళికాగోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం:ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
డివిజన్ పరిధిలోని నోవాపాన్ చౌరస్తా, పాత మార్కెట్, శ్రీరామ్నగర్ కాలనీల్లో మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే కాలనీల్లో పర్యటించారు. వానకాలంలో మురుగునీటితోపాటు వర్షపు నీరు జాతీయ రహదారిపై చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే బాక్స్ డ్రైనేజీ పైపులైన్ సైతం పూర్తి కానున్నట్లు తెలిపారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆయా శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.