న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రత్యర్థి సంస్థలపై మరోసారి పై చేయి సాధించింది. జియో యూజర్ల సంఖ్య 44.32 కోట్లకు చేరుకున్నది. గత జూలైలో భారీమొత్తంలో ఖాతాదారులను అంటే 65.1 లక్షల కస్టమర్లను తన సొంతం చేసుకున్నదని ట్రాయ్ విడుదల చేసిన డేటాలో తేలింది. ఇక రెండో స్థానంలో ఉన్న భారతీ ఎయిర్టెల్లో 19.42 లక్షల మంది కస్టమర్లు చేరడంతో మొత్తం ఆ సంస్థ సబ్స్క్రైబర్ల సంఖ్య 35.40 కోట్ల వద్ద నిలిచింది.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా మరో దఫా కస్టమర్లను కోల్పోయింది. జూలైలో 14.3 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోవడంతో వొడాఫోన్ ఐడియా మొత్తం యూజర్లు 27.19 కోట్ల మంది ఉన్నారని ట్రాయ్ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం ఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 120.9 కోట్లకు చేరుకున్నది.