అమరావతి : ప్రజా క్షేత్రంలో తిరస్కృతుడిగా మిగిలిన చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. వ్యాపారంలో నష్టమొచ్చి దుకాణం మూసే ముందు ఉన్న సరుకులను 90 శాతం డిస్కౌంట్కు ఆఫర్ చేస్తుంటారు. దానికి కూడా ఎవరూ ముందుకు రాకపోతే ఉచితంగా వదిలించుకుంటాడు సదరు యజమాని. పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదంటున్న చంద్రబాబు పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రబ్బరు స్టాంపులా మారిందని ఆరోపిస్తూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.