హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ర్టానికి చెంది న ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంజెక్టబుల్ వ్యాపారాన్ని విడగొట్టే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. ఫార్మా రంగంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న బయోసిమిలర్ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్ద్యేశంతో ఇతర వ్యాపారాలను విడగొట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యాపార విభజన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై అరబిందో ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు.