న్యూఢిల్లీ, జూన్ 29: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్మితమవుతున్న భారీ పెట్రోకెమికల్ హబ్లో పెట్టుబడి చేసేందుకు దేశీ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడి విలువను కంపెనీ వెల్లడించినప్పటికీ, ఇది 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,300 కోట్లు) వుండవచ్చని ధృవీకరింపబడని వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమ అబుదాబిలో ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ దేశ ప్రభుత్వ కంపెనీలైన అడ్నాక్, ఏడీక్యూలు తజిజ్ జాయింట్ వెంచర్ను నెలకొల్పాయి. ఈ వెంచర్లో పెట్టుబడికి రిలయన్స్ సంతకాలు చేసినట్లు తజిజ్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.