త్రిపురారం, మార్చి 23 : నాగార్జునసాగర్ గడ్డపై టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్ అన్నారు. మండలంలోని పెద్ద దేవులపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను పెద్దదేవులపల్లి రిజర్వాయర్లోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ గెలుపునకు సోపానాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు నాగార్జునాచారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, మహిళాధ్యక్షురాలు బైరెడ్డి కవిత, పీఏసీఎస్ చైర్మన్ గోపగాని విజయభాస్కర్, ఎంపీటీసీ అంబటి రాము, సర్పంహచులు శ్రవణ్ కుమార్, అనుముల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, సాంబయ్య, వెంకట్రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా
నిడమనూరు : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా ఏర్పడిందని టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు అల్వాల కళావతి అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణాధ్యక్షుడు మాచర్ల దాసు, యూత్ నాయకులు పగిళ్ల శివ, ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, బండి శ్రీను, ఆదిమల్ల ఎల్లయ్య, మట్టయ్య, కరుణాకర్, ఉన్నం భాస్కర్ పాల్గొన్నారు.