హైదరాబాద్, జూలై 24: రిలయన్స్ డిజిటల్.. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఆఫర్లకు మరోసారి తెరలేపింది. వచ్చే నెల 5 వరకు ఉండనున్న ఈ ఆఫర్ కింద 10 శాతం క్యాష్బ్యాక్ లభించనున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.10 వేలకు పైగా కొనుగోలు చేసిన వారికి రూ.5 వేల వరకు నగదు తిరిగి పొందే అవకాశం కూడా సంస్థ కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లతోపాటు మై జియో స్టోర్తో కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ లభించనున్నది. అలాగే ఈఎంఐ ఆఫ్షన్ను ఎంచుకునే అవకాశం కూడా కల్పించింది.