హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక దసరా ఆఫర్లను ప్రకటించింది. ఆకర్షణీయమైన భారీ డిస్కౌంట్లను ఈ పండుగ సీజన్లో తమ కస్టమర్లకు అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 20 వరకు టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాల కొనుగోళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. పేటీఎం, జెస్ట్మనీ ద్వారా చెల్లింపులపై 10 శాతం క్యాష్బ్యాక్ ఉంటుందని, ఐసీఐసీఐ క్రెడిట్-డెబిట్ కార్డులతో రూ.10వేలు అంతకుమించి జరిపే కొనుగోళ్లపై రూ.2,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది.