హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న అరబిందో ఫార్మాకు అమెరికా గట్టి షాకిచ్చింది. కంపెనీకి మెదక్ జిల్లాలో ఉన్న యూనిట్-1లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నెల 2 నుంచి 12 వరకు యూనిట్లో తనిఖీలు చేసిన అమెరికా నియంత్రణ మండలి యూఎస్ఎఫ్డీఏ ఉన్నతాధికారులు ఏడు లోపాలు ఉన్నట్లు ఫామ్ 483 అబ్జర్వేషన్ జారీ చేసినట్లు తెలుస్తున్నది. లోపాలు తిరిగి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు కంపెన్రీప్రతినిధితెలిపారు.
క్రోనస్ను కొనటం లేదు..
క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(క్రోనస్)లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడం లేదని అరబిందో ఫార్మా తాజాగా ప్రకటించింది. గతవారంలో క్రోనస్లో 51 శాతం వాటాను రూ.450 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన జనరిక్ వెటర్నటీ ఫార్మాస్యూటికల్స్ ప్రొడక్ట్ సంస్థయైన క్రోనస్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఈ నెల 12న ప్రకటించింది. అంతలోనే ఏమైందో తెలియదు కానీ, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తాజాగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.