హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజాస్వామ్య భారత దేశం కోసం ఢిల్లీకి బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ప్రధానమోదీ నరేంద్రమోదీ మీద బండి సంజయ్ పాదయాత్ర చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
ఈ దేశంలో జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా, అమిత్ షా నాయకత్వంలో దళితులు, గిరిజనులు మైనారిటీలపై రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పాద యాత్ర చేయాలని సంజయ్కు సూచించారు.
సోమవారం హుజూరాబాద్లో జరిగిన ఓ సభలో సుమన్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి బండి సంజయ్.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం చేయనున్న పాదయాత్ర కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలో నాలుగు ఓట్లు తెచ్చుకోవడానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ప్రధాని నరేంద్రమోదీ మాటలకు, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతలకు, తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని పేర్కొన్నారు.