చిన్నశంకరంపేట, ఏప్రిల్ 12: మండల పరిధిలోని చందాపూర్కి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వినోద్ తల్లి లక్ష్మీనర్సమ్మ రెండురోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని ధైర్యాన్ని ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన పడాల కృష్ణ తల్లి రాజమ్మ మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆమెవెంట మండల రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్లు రమాదేవి, శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సుధాకర్, రాంరెడ్డి, బందెళ్ల ప్రభాకర్ తదితరులున్నారు.
కౌడిపల్లిలో ఎమ్మెల్యే మదన్రెడ్డి..
కౌడిపల్లి, ఏప్రిల్ 12: కౌడిపల్లి మాజీ ఉపసర్పంచ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు ఓబలాషి వీరాగౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యేతో పాటు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నర్సింహారెడ్డి తదితరులున్నారు.