హైదరాబాద్, సెప్టెంబర్ 7: జుట్టురాలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకోసం ప్రత్యేక ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న డాక్టర్ రెడ్డీస్. మింటాప్ 2 శాతం, మింటాప్ ఎవా 5 శాతం బ్రాండ్తో ఈ ఔషధాలను విక్రయిస్తున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ ఔషధానికి సెంట్రల్ డ్రగ్గ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతినిచ్చిన తొలి ఔషధం ఇదే కావడం విశేషం. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.4,875 వద్ద ముగిసింది.