ముంబై, మే 28: బంగారం, కరెన్సీ ఆస్తులు పెరిగిన నేపథ్యంలో రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారకం నిల్వల విలువ మే 21తో ముగిసిన వారంలో 593 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది కొత్త రికార్డు. అంతక్రితంవారంకంటే వీటి విలువ 2.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. జనవరి 29తో ముగిసిన వారంలో నమోదైన 590 బిలియన్ డాలర్ల నిల్వలు రికార్డు స్థాయి కాగా, అవి ఇప్పుడా స్థాయినిమించా యి. గతవారంలో విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 1.65 బిలియన్ డాలర్ల మేర పెరిగి 548.5 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వల విలువ 1.19 బిలియన్ డాలర్లు అధికమై 36.84 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వుబ్యాంక్ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)వద్దనున్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 1.51 బిలియన్ డాలర్లు కాగా, ఆదే సంస్థ వద్దనున్న ఇతర రిజర్వుల విలువ 5 బిలియన్ డాలర్లని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.