జీ ఎంటర్టైన్మెంట్లో అతిపెద్ద వాటాదారు ఇన్వెస్కో తీరును జీ ఎండీ కం సీఈవో పునీత్ గోయెంకా తప్పుబట్టారు. భారత్లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థలో తమ సంస్థను విలీనం చేయాలని ఇన్వెస్కో చేసిన ప్రతిపాదనను తిరస్కరించానన్నారు. అందుకు తనకు గుణపాఠం నేర్పాలని, జీ బోర్డు నుంచి తొలగించాలని ఇన్వెస్కో ప్రయత్నిస్తున్నదని పునీత్ గోయెంకా ఆరోపించారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు 25 పేజీల అఫిడవిట్ సమర్పించారు.
జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు పునర్వ్యవస్థీకరణ ద్వారా కంపెనీపై పెత్తనం చేయాలని ఇన్వెస్కో ఆలోచిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత యాజమాన్యాన్ని గందరగోళపరిచడంతోపాటు.. ఇప్పటికే సోనీ పిక్చర్స్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని ఇన్వెస్కో తెలిపారు. జీ ఎంటర్టైన్మెంట్ బోర్డులో తన ఉద్వాసనతోపాటు పలువురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించాలని ఆ సంస్థ కోరుతున్నదని పునీత్ గోయెంకా తన అఫిడవిట్లో వెల్లడించారు.
అయితే, అందులో సదరు కార్పొరేట్ సంస్థ పేరును అఫిడవిట్లో పునీత్ గోయెంకా పేర్కొనలేదు. కానీ తమ ప్రతిపాదన మేరకే రిలయన్స్ ఇండస్ట్రీస్, జీ ఎండీ మధ్య విలీన చర్చలు జరిగాయని ఇన్వెస్కో ఇంతకుముందు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఎటువంటి వాల్యూయేషన్ నివేదికల్లేకుండా సదరు కార్పొరేట్ సంస్థలో విలీనం చేయాలన్న ఇన్వెస్క్ ప్రతిపాదనను ఆమోదిస్తే జీ వాటాదారులకు నష్టం వాటిల్లుతుందన్నారు గోయెంకా.. అందుకే ఇన్వెస్కో ప్రపోజల్ను తిరస్కరించినట్లు తెలిపారు. తాను రిలయన్స్ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో సంస్థ వాల్యుయేషన్ నిర్వహించాలని కోరితే.. వారు విలీనానికి ఆసక్తి చూపలేదని గోయెంకా వివరించారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Provident Fund | ఉద్యోగం మారితే.. పాత పీఎఫ్ విత్డ్రా నాట్గుడ్.. ఎందుకంటే?!
మొబైల్ రీచార్జ్లపై ఫోన్పే బాదుడు
Huzurabad | ఈటల మధ్యలో వచ్చిండు..మధ్యలోనే పోయిండు: కెప్టెన్ లక్ష్మీకాంతారావు..