ముంబై, మే 3: ఇప్పటికే విధించిన లాక్ డౌన్ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. మొదట 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్, కొంత సమయంతర్వాత 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ, నష్టాల్లోనే కొనసాగింది.
అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగియడంతో ఆసియా మార్కెట్లు ఈరోజు కొంత అప్రమత్తమయ్యాయి. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో పాటు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా స్టాక్ మార్కెట్లపై పడింది.