హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి సీఎం జగన్ ఖరారు చేసిన నాలుగు పేర్లకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్ రాజు, రమేశ్ యాదవ్ ఎంపిక లాంఛనమైంది. త్వరలో ఈ నలుగురు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండురోజుల క్రితమే వీరి నలుగురు పేర్లను ఎమ్మెల్సీ పదవులకు ఖరారు చేసి ఆమోదం కోసం సీఎం జగన్ గవర్నర్కు పంపారు. ఆయన ఆమోద ముద్ర వేయకపోవడంతో సోమవారం గవర్నర్ను స్వయంగా కలిసి విషయంపై చర్చించారు. సుమారు 40 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. భేటీ ముగిసిన రెండు గంటల వ్యవధిలోనే సీఎం జగన్ ప్రతిపాదించిన నలుగురి పేర్లకు గవర్నర్ ఆమోదం తెలుపడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.