వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన చెన్నారావుపేట మండలం జోజిపేట నారాయణ తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గుగులోతు బద్రు (42) అనే రైతు ఎప్పటిలాగే తన వ్యవసాయ బావి వద్ద పనిలో ఉన్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బద్రు మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
రైతు అవతారం ఎత్తి.. విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ