ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూ.10 కోట్ల పెనాల్టీ విధించింది. ఒక పౌర వేగు (విజిల్ బ్లోయర్) ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నది.
రెగ్యులరేటరీ నిబంధనలను పాటించడంలో అవకతవకలు జరిగాయని తేలింది. ఆటో రుణాల పోర్ట్ఫోలియోలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిబంధనలు పాటించలేదు.
దీంతో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949లోని 6(2), 8 సెక్షన్ల ప్రకారం హెచ్డీఎఫ్సీపై ఈ పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఖాతాదారులకు థర్డ్-పార్టీ ఆర్థికేతర ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయానికి సంబంధించిన పత్రాలను పరిశీలించాక తనిఖీ చేశాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తొలుత దీనిపై బ్యాంకుకు ఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరణ అందిన తర్వాత పెనాల్టీ విధించాలని నిర్ణయించింది.
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు