ముంబై, జూన్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రిజర్వుబ్యాంక్ దాదాపు 1.13 కోట్ల జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, నో యువర్ కస్టమర్ అంశాలపై జారీచేసిన ఆదేశాల్ని అనుసరించని కారణంగా జరిమానా విధించినట్లు ఆర్బీఐ ప్రకటన తెలిపింది. అలాగే అహ్మదాబాద్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన ఎస్వీసీ కో-ఆపరేటివ్ బ్యాంక్, సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్లపై ఆర్బీఐ జరిమానాలు విధించింది.