శంషాబాద్, జూలై 19:వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో 4 నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సి వేస్, ప్రాథమిక రన్వేను విజయవంతంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని సోమవారం జీఎంఆర్ ఎయిర్పోర్టు కమ్యూనికేషన్ అధికారవర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో రన్వేపై కెపాటిసి పెంచటానికి మార్గం సులభమైంది. రిహాబిలిటేషన్ వర్క్ అనంతరం ప్రాథమిక రన్ వేను పునః ప్రారంభించారు.