‘సురక్షా’ ఖమ్మమే నా లక్ష్యం
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ‘సూపర్ స్ప్రెడర్ల’కు టీకా
ఉచిత వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మంలో ఏడు కేంద్రాల ద్వారా టీకా
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
రఘునాథపాలెం, జూన్ 15: సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యాక్సిన్ అందించి సురక్షా ఖమ్మాన్ని సాధించడమే లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు, మోటార్ కారు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రఘునాథపాలెం, వైరా మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా, బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.
టీకాతోనే కరోనా నివారణ సాధ్యమని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఖమ్మం నియోజకవర్గంలో సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో డ్రైవర్లుకు నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యాక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్పై ప్రజలు భయాన్ని వీడాలన్నారు. ఒకటి రెండురోజులు జ్వరం, నొప్పులు వస్తాయని, ఆ తర్వాత ఎవరి పని వారు చేసుకోవచ్చన్నారు. తెలంగాణను కరోనా విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఖమ్మంలో ‘స్ప్రెడర్ల’ కోసం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 25వేల మందికి ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. అనంతరం దానవాయిగూడెం డంపింగ్యార్డులో రూ.1.32 కోట్లతో నూతనంగా నిర్మించిన మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ప్రారంభించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సిబ్బంది ట్రాన్స్ఫర్ స్టేషన్ తరలించాలన్నారు. దీంతో రవాణా, సమయ భారం తగ్గుతుందన్నారు.
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన..
రఘునాథపాలెం, జూన్ 15: నగరంలోని ధంసలాపురం వద్ద రూ.16.94 కోట్ల నిధులతో నిర్మించే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ధంసలాపురం రైల్వే వంతెన వద్ద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మెయిన్ రోడ్కు అనుసంధానంగా రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం 9వ డివిజన్ రోటరీనగర్లో రూ.37 లక్షల వ్యయంతో నిర్మించే వీధి వ్యాపారుల మార్కెట్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నూతన బస్టాండ్ ప్రాంగణంలో వీధి వ్యాపారులకు మార్కెట్ నిర్మించి షాపులు కేటాయించామన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగర మేయర్ పునకొల్లు నీరజ, జిల్లా రవాణాశాఖ అధికారి తోట కిషన్రావు, నగర కమిషనర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్వో మాలతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, ఎంవీఐలు వరప్రసాద్, వెంకటపుల్లయ్య, ఏవో జావెద్ అలీ, ఆర్టీవో ఆఫీస్ ఉద్యోగులు సంతోశ్, రవీందర్రెడ్డి, నదీమ్, సునీల్, సరిత, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల శ్రీవిద్య, కర్నాటి కృష్ణ, కాపర్తి శరత్, టీఆర్ఎస్ నాయకులు యెచ్చు ప్రసాద్, చిలుమూరు కోటి, కుర్రా మాధవరావు, అంజిరెడ్డి, కొత్త రవి, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు.