థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉల్హాస్నగర్ పట్టణంలో నాలుగంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని క్యాంపు నెంబర్-1 ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనం మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాల సమయంలో కుప్పకూలింది.
శిథిలాల కింద 16 మంది చిక్కుకోగా వీరిలో 11 మందిని అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సభ్యులు రక్షించారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. శిథిలాల కింద ఉన్న మరో ఇద్దరి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. స్వల్పంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.