PF Accounts | ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్)ను కేంద్రం రెండుగా విభజించింది. నూతన ఆదాయం పన్ను నిబంధనలకు అనుగుణంగా పీఎఫ్ ఖాతాలను వేర్వేరు ఖాతాలుగా మార్చేసింది. ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటి జమ చేసిన పీఎఫ్ ఖాతాపై ప్రభుత్వం ఆదాయం పన్ను వసూలు చేస్తుంది. పీఎఫ్ అకౌంట్స్లో వేర్వేరు ఖాతాల నిర్వహణకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గత నెల 31న కొత్త రూల్స్లో నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిబంధన ప్రకారం ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లో సభ్యులందరినీ టాక్సబుల్, నాన్ టాక్సబుల్ ఖాతాలుగా విభజిస్తారు. 2021 మార్చి 31 నాటి క్లోజింగ్ ఖాతా ఆధారంగా నాన్ టాక్సబుల్ ఖాతాలను చేరుస్తారు. అధికార వర్గాల కథనం ప్రకారం ఈ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని సమాచారం. ఆదాయం పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్ 9డీ
ప్రకారం పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షలు మించి జమ చేసిన వారిపై పన్ను విధిస్తారు.