కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మిమీ’. సరగసీ విధానం కారణంగా మహిళలకు ఎదురయ్యే కష్టాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంగళవారం ట్రైలర్ను విడుదలచేశారు. ఈ ట్రైలర్లో సరగసీ కోసం కృతి సనన్ను ఒప్పించేందుకు పంకజ్ త్రిపాఠి ప్రయత్నించడం, తన గర్భాన్ని కుటుంబసభ్యులకు కనిపించకుండా దాచేందుకు కృతి పడిన ఇబ్బందులు వినోదాన్ని పంచుతున్నాయి. సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను విదేశీ తల్లిదండ్రులు తిరస్కరించడంతో నాయికకు ఎదురయ్యే సంఘటనల్ని ఎమోషనల్గా తీర్చిదిద్దారు. ఈ నెల 30న నెట్ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. కృతిసనన్ నటిస్తున్న తొలి మహిళా చిత్రమిదే కావడం గమనార్హం.