హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): పరిశోధకులు, వైద్య నిపుణులు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన పూర్తిస్థాయి సహాయ సహకారాలను అందించేందుకు గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ-సీఐఈలో పోస్ట్ డాక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. ఓజాస్ మెడిటెక్, బయోనెస్ట్లతో కలిసి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏడాది వ్యవధితో కార్యక్రమం ఉంటుంది. ఇక్కడి రిసెర్చ్ ప్రొఫెసర్స్తో కలిసి పనిచేసే అవకాశంతోపాటు, నెలవారి భృతిగా రూ.50వేలు, సీడ్ ఫండ్గా రూ.25 లక్షల వరకు పొందవచ్చు. మరిన్ని వివరాలకు https:// forms. gle/nfJYVBshrrcoKy2D8 సంప్రదించవచ్చు.