హైదరాబాద్, ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బుధవారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ ఖాతాదారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రాయితీ ప్రయోజనాలను పొడిగించడం కోసం మెడికవర్ గ్రూప్ ఆస్పత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీస్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఇరు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని 300 శాఖల కస్టమర్లు, ఉద్యోగులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరినైట్లెంది. ఈ ఎక్స్క్లూజివ్ ప్యాకేజ్ ఆఫర్లో కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందని పీఎన్బీ ఏపీ, టీఎస్, కర్ణాటక జోనల్ హెడ్, జీఎం అశుతోష్ చౌధరి తెలిపారు.