న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రభుత్వానికి చెందిన ఆర్థిక సేవల సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కనీస నగదు నిల్వలు లేని ఖాతాల నుంచి జరిమానాల రూపంలో రూ.170 కోట్లు వసూలు చేసింది. అంతక్రితం ఏడాది వసూలు చేసిన రూ.286.24 కోట్లతో పోలిస్తే ఇది తగ్గింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ విషయం వెల్లడైంది. గతేడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్ నుంచి జూన్) మధ్యకాలంలో రూ.35.46 కోట్లు వసూలు చేయగా..రెండో త్రైమాసికంలో మాత్రం ఎలాంటి వసూళ్ళు జరుపలేదు. కానీ, మూడో త్రైమాసికంలో రూ.48.11 కోట్లు, నాలుగో త్రైమాసికంలో రూ.86.11 కోట్లు వసూలైనట్లు మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక వేత్త చంద్ర శేఖర్ గౌర్ రైట్ టూ ఇన్ఫర్మేషన్(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు బ్యాంక్ సమాధానం ఇచ్చింది. దీంతోపాటు ఏటీఎం లావాదేవీల చార్జిలు వసూ లు చేయడంతో మరో రూ.74.28 కోట్ల నిధులు సమకూరాయి.