న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించింది. సీనియర్ సిటిజన్లు తమ వద్ద ఉన్న పెట్టుబడులను ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆధారపడి ఉన్నారు. తమకు మెరుగైన రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ల కోసం ఎదురుచూస్తుంటారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అష్యూర్డ్ రిటర్న్స్ ఇస్తుందని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ అని పేర్కొన్నారు. రెగ్యులర్ ఇన్కం కావాలనుకుంటే ప్రధానమంత్రి వయా వందన యోజన (పీఎంవీవీవై)లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పీఎంవీవీవై స్కీమ్ ఒక రిటైర్మెంట్ కం పెన్షన్ ప్లాన్. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆధ్వర్యంలో 2017లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి, నిర్వహిస్తున్నది. ఇన్వెస్ట్మెంట్పై ఈ స్కీమ్ గ్యారంటీ రిటర్న్ హామీ ఇస్తుంది.
పీఎంవీవీవై పథకంలో పెట్టుబడి పెట్టాలంటే సీనియర్ సిటిజన్ల వయస్సు 60, అంతకంటే ఎక్కువ వయస్కులై ఉండాలి. కనీసం రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలవారీగా రూ.1000 పెన్షన్ లభిస్తుంది.
ఎస్సీఎస్ఎస్ కూడా 60, అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్ల కోసం ప్రారంభించిన పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వ భద్రత ఉంటుంది. పోస్టాఫీసులోనూ ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు.
రెగ్యులర్ ఇన్కం రావాలంటే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఇటు పీఎంవీవీవై, అటు ఎస్సీఎస్ఎస్ పథకాల్లోనూ 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక్కోసారి త్రైమాసికానికి ఒకసారి వడ్డీరేటు మారొచ్చు.
అయితే, పీఎంవీవీవై పథకంలో పెట్టిన పెట్టుబడిపై ఒకే వడ్డీరేటు కొనసాగుతుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు మరింత తగ్గితే మాత్రం పీఎంవీవీవై అత్యంత ఆకర్షణీయ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్గా నిలుస్తుందని భావిస్తున్నారు.
2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ వివాదం తలెత్తడంతో 12 గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఎస్సీఎస్ఎస్ స్కీమ్లో మదుపులు ఐదేండ్లకు మెచ్యూర్ అవుతాయి. అదే పీఎంవీవీవైలో మదుపు మెచ్యూర్ కావడానికి 10 ఏండ్ల గడువు ఉంటుంది. తక్కువ మెచ్యూరిటీ టైం గల పథకాల విషయానికి వస్తే ఎస్సీఎస్ఎస్ బెటర్ స్కీం. పెనాల్టీ చెల్లింపుతో ప్రీ-మెచ్యూర్డ్గానే విత్ డ్రా చేసుకోవచ్చు.
రెడ్డీస్తో రాక్వెల్ ఒప్పందం
కరోనా ఎఫెక్ట్.. భారత్ స్మార్ట్ ఫోన్లకు సెమీ కండక్టర్ల కొరత!!
కోవిడ్ బాధితుల కోసం ఐటీ ప్రొఫెషనల్స్ అండ.. ఎలాగంటే?!
ట్రంప్ ‘స్కాం’ దెబ్బ: 2 వారాల కనిష్టానికి బిట్ కాయిన్!!
సియాంకు కేంద్రం హెచ్చరిక: ఏడాదిలోపు ఇథనాల్ బైక్స్ కావాలి!
బిట్ కాయిన్ ఒక స్కాం.. డాలర్కు వ్యతిరేకం
సెంట్రల్ బ్యాంక్తో ఐఐఎఫ్ఎల్ హోమ్ ఒప్పందం
ఎల్ఐసీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
ఆ డాక్టర్ 8 నెలల ప్రెగ్నెంట్.. అయినా ఆమె వృత్తికే అంకితం
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 6,148 మంది మృతి
టిక్టాక్ సహా చైనీస్ యాప్స్పై అమెరికా నిషేధం ఎత్తివేత
వ్యాక్సిన్ తీసుకుంటే టెస్లా కార్లు, ఐఫోన్లు, బంగారు కడ్డీలు
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ పెరిగిన బాల కార్మికుల సంఖ్య
వేలంలో రూ.138 కోట్ల ధర పలికిన బంగారు నాణెం
ఒక కారులో వచ్చి.. అమ్మాయితో మరో కారులో..
కోయిలకొండలో చిరుత.. రెండు కాళ్లకు గాయాలు