న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరే దిశగా కొవిడ్ నేపథ్యంలో ఏర్పడిన అవకాశాల్ని ఉపయోగించుకోవాలని, కొత్త ఎగుమతి కేంద్రాల్ని అన్వేషించాలని, ఎగుమతిచేసే ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవాలంటూ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశాల్లోని భారత వాణిజ్య సంఘాలు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్తో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫెరెన్సింగ్లో మాట్లాడుతూ ఉత్పత్తి పెంచడం, రవాణా వ్యయాలు తగ్గించడం, దేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ల అన్వేషణ ద్వారా ఎగుమతుల్ని పెంచుకోవొచ్చని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో ఎగుమతుల విలువ 20 శాతంగా ఉన్నదని, మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ఉత్పత్తి దృష్ట్యా ఎగుమతుల్ని బాగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నదన్నారు.