Gold Buying options |బంగారం అంటే భారతీయ వనితలకు ఎంత ఇష్టమో.. ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంటాయి. బంగారంలో మదుపునకు పలు మార్గాలు ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్పై గానీ, డిజిటల్ గోల్డ్ రూపంలో గానీ పెట్టుబడులు పెట్టొచ్చు. బంగారంపై పెట్టుబడులతో దీర్ఘ కాలిక లాభాలు ఉంటాయి. క్రెడిట్ రిస్క్ ఉండదు. నగదు లభ్యత ఉంటుంది. ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే డిజిటల్ గోల్డ్లో మదుపు చేయడం చాలా సమర్థవంతంగా ఉండటంతోపాటు ఖర్చు తక్కువ. ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టడంలో మంచి చెడులేమిటో చూద్దామా..!
డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్వల్ల అదనపు స్టోరేజీ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ కంపెనీల వద్ద గల వాలెట్స్లో డిజిటల్ గోల్డ్ సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. దీనికి భిన్నంగా ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటే దొంగలు, దోపిడీదారుల ముప్పు పొంచి ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా లాకర్లో పెట్టడం లేదా బీమా కవరేజీ తీసుకోవాల్సిందే. బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకునే వారు కూడా లాకర్లు అలాట్మెంట్ చేయాలన్న కండీషన్ పెట్టాలని సూచిస్తున్నారు. కనుక ఫిజికల్ గోల్డ్ కలిగి ఉండటం వల్ల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.
డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చాలా చిన్న మొత్తాలతో చేయొచ్చు. కనీస కొనుగోలు పరిమితుల్లేవు. ఇన్వెస్టర్లు బంగారం పరిమాణంలోగానీ, విలువలో గానీ క్రయ విక్రయాలు సాగించొచ్చు. భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 10 గ్రాముల గోల్డ్ బిస్కట్లు, కాయిన్లు ప్రామాణికం కానున్నాయి.
డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవారు నేరుగా చేయరు. థర్డ్ పార్టీకి అధికారం కల్పిస్తారు. థర్డ్ పార్టీ సంస్థకు చెందిన ఏజెంట్లు బంగారం కొనుగోలు చేసి.. ఇన్వెస్టర్ల తరఫున ఒక వాలెట్లో భద్ర పరుస్తారు. ఆ డిజిటల్ గోల్డ్ విక్రయించాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది. మార్కెట్ ధరకు డిజిటల్ గోల్డ్ను విక్రయించగా వచ్చిన సొమ్ము ఇన్వెస్టర్ ఖాతాలో జమ చేస్తారు.
ఫిజికల్ గోల్డ్ ధరలు అంతటా ఒకేలా ఉండవు. డిజిటల్ గోల్డ్ ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి.ఇన్వెస్టర్ 24 క్యారెట్ల బంగారం నాణ్యత గురించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. సంబంధిత థర్డ్ పార్టీ సంస్థ ఏజెంట్లు దాని నాణ్యతపై రాజీ పడబోరు. ఇక ఫిజికల్ గోల్డ్ నాణ్యత 100 శాతం ఉంటుందన్న గ్యారంటీ ఉండదు.
బంగారం నేరుగా కొనుగోలు చేస్తే దాని ధరలో 20 నుంచి 30 శాతం మేకింగ్ చార్జీలు వసూలు చేస్తారు. డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్పై మూడు శాతం జీఎస్టీ విధిస్తారు.
ఆదాయం పన్ను చట్టం ప్రకారం ఒక ఇన్వెస్టర్ బంగారంపై పెట్టిన పెట్టుబడులు మూడేండ్లలోపు ఉపసంహరించుకోవాలి. మూడేండ్ల గడువు దాటితే మాత్రం బంగారంపై పెట్టుబడులకు వచ్చే లాభాల మీద సదరు వ్యక్తి 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్పై పెట్టుబడులను ఉపసంహరించినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధిస్తారు. డిజిటల్ గోల్డ్పై పెట్టుబడుల ఉపసంహరణ చాలా ఈజీ. 36 నెలల తర్వాతే డిజిటల్ గోల్డ్పై పెట్టుబడులను నగదుగా మార్చుకుంటే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాలి. డిజిటల్ గోల్డ్పై పెట్టుబడులు రూ.50 లక్షలు దాటొద్దు. అలా దాటితే 0.1 శాతం టాక్స్ చెల్లించాల్సిందే. ఫిజికల్ గోల్డ్పై పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఒక కాయిన్ లేదా బిస్కట్పై మాత్రమే చేస్తారు.