పుణె: పియాజియో సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిసన్ వెస్పా స్కూటర్( Vespa scooter )ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ 125 సీసీ, 150 సీసీలలో అందుబాటులో ఉండనుంది. వీటి ధరలను రూ.1.26 లక్షలు, రూ.1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, పుణె)గా నిర్ణయించారు. ఈ స్కూటర్ను సంస్థ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎడిషన్ స్కూటర్లను బాగా హైలైట్ చేయడానికి పియాజియో దీనికి గ్లాసీ మెటాలిక్ గియాలో కలర్ను ఇవ్వడం విశేషం. సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ స్కూటర్కు ముందు, రెండు వైపులా 75 నంబర్ ఉంచారు. ఈ స్కూటర్తోపాటు సంస్థ ఓ ప్రత్యేకమైన వెల్కమ్ కిట్ అందిస్తోంది.