ఓవెరి: నైజీరియాలో ఓ జైలుపై సాయుధులు దాడి చేశారు. ఈ ఘటనలో 1800 మంది ఖైదీలు పరారీ అయ్యారు. మెషీన్ గన్ను, రాకెట్ గ్రేనేడ్లతో స్థానిక మిలిటెంట్లు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓవెరి పట్టణంలో ఉన్న జైలుపై సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు సాయుధులు అటాక్ చేశారు. రెండు గంటల పాటు సాగిన కాల్పుల్లో.. పోలీసులు, మిలిటరీ బిల్డింగ్లపై సాయుధులు దాడి చేశారు. అయితే పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు ప్రభుత్వ దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఇండీజీనియస్ పీపుల్ ఆఫ్ బైఫ్రా(ఐపీఓబీ) గ్రూపు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. కానీ ఆ గ్రూపు ప్రతినిధి మాత్రం ఈ ఘటనను ఖండించారు.