ముంబై: ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఫార్మ్ఈజీ అనే ఆన్లైన్ ఫార్మా సేవల సంస్థ.. తన రైవల్ మెడ్లైఫ్ను టేకోవర్ చేసినట్లు మంగళవారం ప్రకటించింది. దేశీయ ఆన్లైన్ ఫార్మసీ సేవల రంగం సంఘటితం దిశగా అడుగులు పడుతున్నాయి. ఔషధాల విక్రయ మార్కెట్ షేర్ చేసుకోవడానికి రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్ పోటీ పడుతున్నాయి.
కేవలం ఒక నెలలోనే రెండు కోట్ల పై చిలుకు కుటుంబాలకు ఆన్లైన్లో ఔషధాల డెలివరీ సంస్థగా నిలిచింది. దూరంతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా అతిపెద్ద హెల్త్కేర్ డెలివరీ ప్లాట్ఫామ్గా తమ సంస్థను నిలిపిందని ఫార్మ్ ఈజీ కో-ఫౌండర్ ధావల్ షా పేర్కొన్నారు.
తక్షణం మెడ్లైఫ్ సేవలు నిలిపివేస్తుందని, తమ ఫార్మా సంస్థలో విలీనమవుతుందని ఫార్మా ఈజీ తన బ్లాగ్ పోస్ట్లో రాసుకుంది. మెడ్ లైఫ్ సంస్థ కస్టమర్లు, రిటైల్ పార్టనర్లు ఇక ఫార్మ్ఈజీ ప్లాట్ఫామ్లో జత కలుస్తారు.
సింగిల్ ప్లాట్ఫామ్గా కస్టమర్ల అవసరాలను తీర్చడంపైనే ప్రధానంగా కేంద్రీకరించామని ధావల్ షా తెలిపారు. ఈ ప్రతిపాదనను ఇంతకుముందు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదానికి పెట్టింది ఫార్మ్ ఈజీ. గతేడాది ఆగస్టులో ఈ విషయం బహిర్గతమైంది.
ఫార్మ్ఈజీ, మెడ్లైఫ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మెడ్లైఫ్ వాటాదారులకు ఫార్మ్ ఈజీ పేరెంట్ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్లో 19.59 శాతం వాటా లభిస్తుంది. దాని విలువ 240 మిలియన్ల డాలర్లు.
మెడ్ లైఫ్ అతిపెద్ద వాటాదారు, ఆల్కెమ్ ల్యాబోరేటరీస్ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రభాత్ నారాయణ్ సింగ్. ఆయన ఏపీఐ హోల్డింగ్స్లో డైరెక్టర్గా నియమితులవుతారు. దేశంలోనే అతి పెద్ద స్టార్టప్ సంస్థగా పేరొందిన ఏపీఐ హోల్డింగ్స్.. 150 కోట్ల డాలర్లు ఉంటుంది.
ఇంతకుముందు రిలయన్స్ రిటైల్.. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న నెట్మెడ్స్ సంస్థను రూ.640 కోట్లకు గత ఆగస్టులో టేకోవర్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న వన్ ఎంజీ సంస్థలో 65 శాతం వాటాను టాటా సన్స్ కొనుగోలు చేసింది.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
గంటకు రూ.75 కోట్లు పెరిగిన గౌతం ఆదానీ సంపద!
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం.. అనుమతించండి మోదీజీ – విస్మయం కలిగిస్తున్న పత్రికా ప్రకటన