హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయ వినియోగదారుల హక్కులు-నేర నిరోధక విభాగం (ఎన్సీఆర్&ఏసీబీ) తెలంగాణ రాష్ట్ర మీడియా సెల్ ఇంచార్జీగా అద్దేపల్లి ఫణికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు హాజీ మహమ్మద్ ముజాహిద్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ బాధ్యతపట్ల ఫణికుమార్ ఆనందం వ్యక్తం చేశారు. వినియోగదారుల హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు.