Pre-pandemic level | దేశంలో 17 నెలల స్థాయికి పెట్రోల్ విక్రయాలు చేరుకున్నాయి. అయితే, దేశ ఆర్థిక లావాదేవీలకు కీలక ఇండికేటర్గా భావించే డీజిల్ విక్రయాలు జూలైలో 11 శాతం తగ్గుముఖం పట్టాయి. కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత బిజినెస్ లావాదేవీలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి.
దేశీయ పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో 90 శాతం పట్టు కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థల వద్ద ఉన్న డేటా ప్రకారం 2019 జూలైతో పోలిస్తే గత నెలలో పెట్రోల్ వినియోగం 3.5 శాతం ఎక్కువ అని తేలింది.
డీజిల్ వినియోగం 89 శాతానికి చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే పెట్రోల్ సేల్స్ 17 శాతం, డీజిల్ వినియోగం 12 శాతం పెరిగింది. జూన్ నెలతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువ. కానీ డీజిల్ విక్రయాలు ఒకశాతం లోపు తగ్గాయి.
దీపావళి నాటికి డీజిల్ విక్రయాలు సాధారణ స్థాయికి చేరుతాయని ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య చెప్పారు.
జెట్ ఫ్యూయల్ విక్రయం జూలైలో 53 శాతం పెరిగింది. జూన్ నెలతో పోలిస్తే జూలైలో 21 శాతం ఎక్కువ. గతేడాదితో పోలిస్తే 29.5 శాతం ఎక్కువ జెట్ ఫ్యూయల్ సేల్స్ జరిగాయి.
వంట గ్యాస్ సిలిండర్ల వాడకం 2019 జూలైతో పోలిస్తే గత నెలలో 7.5 శాతం ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగింది.