ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా
ముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.75కు, డీజిల్ ధర రూ.68కి దిగివస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయపరంగా వాటిల్లే నష్టం రూ.లక్ష కోట్లేనని, ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 0.4 శాతానికి సమానమని లెక్కగట్టారు.