న్యూఢిల్లీ: భర్తతో పోట్లాట నేపథ్యంలో ఒక మహిళ పసివాడి ఉసురు తీసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 11 నెలల బాబుకు జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లనందుకు శుక్రవారం భార్యాభర్తల మధ్య పోట్లాట జరిగింది. ఈ నేపథ్యంలో భర్తపై ప్రతీకారం కోసం ఆ తల్లి పసి బాలుడి గొంతునులిమింది. పరిస్థితి సీరియస్గా ఉన్న బాబును ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడు. దీంతో బాబు మరణానికి నువ్వే కారణమంటూ ఇద్దరూ ఆరోపించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరిపారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్, వారిద్దరి ఫోన్ కాల్ రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా తల్లి తన బిడ్డను గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.