Petrol Expensive | పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం కూడా పెరిగాయి. లీటర్ పెట్రోల్/ డీజిల్పై 35 పైసలు పెంచేశాయి కేంద్ర ముడి చమురు సంస్థలు దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59. లీటర్ డీజిల్ ధర రూ.96.32. ఈ నెలలో 24 రోజుల్లో 19 సార్లు చమురు సంస్థలు ఇంధన ధరలు పెంచివేశాయి. దీంతో ఈ నెలలోనే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.5.95, లీటర్ డీజిల్ రూ.6.45 పెరిగింది. ఇక జనవరి ఒకటో తేదీన లీటర్ పెట్రోల్ రూ.83.97, లీటర్ డీజిల్ రూ.74.12లకు చేరింది. ఇప్పుడు లీటర్ పెట్రోల్ రూ.107.59, డీజిల్ 96.32 పలుకుతోంది. అంటే ఈ ఏడాది పది నెలల్లో పెట్రోల్ రూ.23.62, డీజిల్ రూ.22.20 పెరిగింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో 100 డాలర్ల మార్క్కు చేరుకున్నది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 85 డాలర్లు పలుకుతున్నది. అంటే మున్ముందు బ్యారెల్ క్రూడ్ 100 డాలర్లు దాటితే.. ప్రస్తుత ధరలతో పోలిస్తే పెట్రోల్.. డీజిల్ రూ.8-10 పెరుగుతాయి. ఇక వ్యాట్ పన్నులు ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వాహనాలదారులపై మరింత భారం పడుతుంది.
వచ్చే ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లను తాకుతుందని ఇరాన్ చమురుశాఖ మంత్రి ఏషాన్ అబ్దుల్ జబ్బారీ తెలిపారు. ఏడాది క్రితం 42.5 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 85 డాలర్ల మార్క్ను దాటేసింది. భారత్ ఇంధన అవసరాలన్నీ 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. మున్ముందు దిగుమతులు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే దేశంలోని 16 రాష్ట్రాల్లో, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్క్ దాటేసింది. ఆ జాబితాలో ఉన్న రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలివి..
ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్. డామన్ అండ్ డయూ. ఛత్తీస్గఢ్. ఢిల్లీ. జమ్ముకశ్మీర్. ఆంధ్రప్రదేశ్. బీహార్. మహారాష్ట్ర. కర్ణాటక. మణిపూర్. నాగాలాండ్. పుదుచ్చేరి. తెలంగాణ. పంజాబ్. సిక్కిం. ఒడిశా. కేరళ. తమిళనాడు. పశ్చిమబెంగాల్. త్రిపుర.
మిజోరం, జార్ఖండ్, గోవా, అసోం, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, దాద్రా అండ్ నగర్ హవేలీ, రాజస్థాన్లలోనూ రూ.100 దాటింది.
ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రూ.100 మార్క్ దాటింది. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ పలుకుతుంది. మున్ముందు బ్యారెల్ ముడి చమురు ధర డాలర్ పెరిగితే.. దేశంలో లీటర్పై 55-60 పైసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యారెల్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటితే మాత్రం లీటర్ పెట్రోల్.. డీజిల్ మీద మరో రూ.10 అదనపు భారం పడుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్లాట్స్ అనలిటిక్స్ అంచనా వేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
Honeytrap : హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ