అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు.
ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీలం సాహ్నీ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవికాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది.
ఆ మరుసటి రోజే నూతన ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎంపికైన నీలం సాహ్నికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.