న్యూఢిల్లీ, జూలై 12: దేశంలోనే అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్ధమైంది. పేటీఎం ప్రతిపాదించిన రూ.16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు ఆ సంస్థ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. సోమవారం జరిగిన కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్శేఖర్ శర్మ ప్రవేశపెట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ప్రతిపాదనను వాటాదారులు ఆమోదించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా ఈక్విటీ షేర్లతో 12,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్తో 4,600 కోట్లు సమీకరిస్తున్నారు.
యూజర్లకు ఛాన్స్: స్టాక్ ఎక్సేంజీల్లో ఐపీవోలు ప్రారంభం కాకముందే వాటికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తమ యూజర్లకు పేటీఎం మనీ అందిస్తున్నది. ‘ప్రీ-ఐపీవో ఓపెన్ అప్లికేషన్’ ఫీచర్ ద్వారా తమ సైట్లో ఎప్పుడైనా ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చన్నది.