న్యూఢిల్లీ, జూలై 2: డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం.. డిజిటల్ ఇండియా ఆరేండ్ల సెలబ్రేషన్స్లో భాగంగా అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు రూ.50 కోట్ల క్యాష్బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా జరిగే ప్రతీ లావాదేవీకి ఈ ఆఫర్ వర్తిస్తుందని శుక్రవారం సంస్థ తెలియజేసింది. దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తెలంగాణ, ఏపీలతోపాటు కర్నాటక, కేరళ, తమిళనాడుల్లో ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నామని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ చెప్పారు.