న్యూఢిల్లీ: ఐపీవో ద్వారా నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్న వేళ.. ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వైదొలుగుతున్నారు. సంస్థ ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ తన రాజీనామాను యాజమాన్యానికి అప్పగించినట్లు సమాచారం. ఇతర ఎగ్జిక్యూటివ్లు సైతం వైదొలుతున్నారని తెలుస్తున్నది.
ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్మాన్ సాచెస్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన అమిత్ నయ్యర్ను పేటీఎం 2019లో నియమించుకున్నది. తన స్టార్టప్ ఫైనాన్సియల్ సర్వీసుల విభాగం నిర్వహణతోపాటు ఇన్సూరెన్స్, రుణాల జారీ విధి విధానాల ఖరారుకు నియమించుకున్నది.
ఐపీవోకు వెళుతున్న వేళ అమిత్ నయ్యర్ సంస్థను వీడటం సరి కాదని పేటీఎం వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కంపెనీ ప్రెసిడెంట్గా మాధూర్ డియోరా ఉన్నారని పేర్కొంది. కొన్ని నెలలుగా సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఒకరి తర్వాత మరొకరు వైదొలుగుతున్నారు.
సంస్థ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ అధికారి రోహిత్ ఠాకూర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ వీర్, కంపెనీ మార్కెటింగ్ హెడ్ జాస్కరణ్ సింగ్ కపానీ సంస్థను వీడుతున్నారు. 2019 డిసెంబర్లో రోహిత్ ఠాకూర్ నియమితులయ్యారు. గతనెలలో వైదొలిగారు.
రోహిత్ ఠాకూర్ వైదొలిగిన కొన్ని నెలలకే అమిత్ నయ్యర్ వైదొలగడం గమనార్హం. అయితే, వ్యక్తుల మార్పుపై స్పందించబోమని పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది.
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!